సాక్షి ఛానెల్, వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తా : ఏపీ సీఎస్ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

-

ఏపీ సీఎస్ కు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, సీపీఆర్వో పూడి శ్రీహరి మీద పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలంటూ జీఏడీ కార్యదర్శికి లేఖ రాశారు ఏబీ వెంకటేశ్వరరావు.

తన విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ చెవిరెడ్డి, శ్రీహరి సహ సాక్షి పేపర్, సాక్షి ఛానెల్, సాక్షి పేపర్ ఎడిటర్ వర్దెల్లి మురళీపై పరువు నష్టం దావా వేస్తానని లేఖలో పేర్కొన్న ఏబీవీ… తన సస్పెన్షన్ విషయంలో తప్పుడు సమాచారంతో కూడిన ఆరు పేజీల పవర్ పాయింట్ ప్రజెెంటేషన్ను మీడియాకు విడుదల చేశారని పూడి శ్రీహరిపై అభియోగం వేశారు.

తనపై పూడి శ్రీహరి ప్రచారం చేసిన విషయాలేవీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో లేదని స్పష్టం చేసిన ఏబీవీ… విచారణ సందర్భంలో కూడా తనపై జరిగిన దుష్ప్రచారంలోని అంశాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. పూడి శ్రీహరి ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా తనపై మీడియాలో దుష్ప్రచారం జరిగిందని లేఖలో ఏబీవీ ఆవేదన వ్యక్తం చేశారు. తానే కాకుండా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ కథనాలు బాధ కలిగించాయన్న ఏబీ వెంకటేశ్వరరావు… లేఖ కాపిని సీఎస్ సమీర్ శర్మకు పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news