ఉపాధ్యాయుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి : ఏపీ సీఎస్‌తో జేఏసీ నేత‌లు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌మ‌ను కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు త‌మ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని పీఆర్సీ స్ట్ర‌గుల్ క‌మిటీ ప్ర‌తినిధులు ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌కు ఫిర్యాదు చేశారు. త‌మ పై అనుచిత వ్యాఖ్య‌లు, త‌మ పై దుష్ప్ర‌చారం చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై క్ర‌మ శిక్షణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను పీఆర్సీ స్ట్రగుల్ కమిటి నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ కోరారు.

అనంత పురం జిల్లాలో కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు త‌మను విధీ కుక్కల‌తో పోలుస్తున్నార‌ని సీఎస్ కు తెలిపారు. అలాగే తాము మృతి చెందామ‌ని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నార‌ని తెలిపారు. అలాగే త‌మ ఫోటోల‌ను మార్ఫు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నార‌ని సీఎస్ కు తెలిపారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్య‌లు, దుష్ప్రచారం చేయ‌డం వ‌ల్ల తమ నలుగురి ప్రతిష్టతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగుతుంద‌ని తెలిపారు. ఇలా చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌పై వెంట‌నే క్ర‌మ‌శిక్షణా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news