తిరుమలలో సినీ నటి హల్ చల్

-

తిరుమలలో సినీ నటి అర్చనా గౌతమ్ రచ్చ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందితో అర్చన వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమలలో కొంతమంది సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని అర్చన ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో ఇవాళ మధ్యాహ్నం పోస్టు చేశారు.

తాను వీఐపీ దర్శనం కోసం రూ. 10500 టికెట్‌ తీసుకున్నానని, దర్శనానికి ఇంత వసూలు చేయటం దారుణమని ఆమె ఆరోపించారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఇది సోమవారం జరిగిన ఘటన కాదని, గురువారం జరిగిందని తితిదే అధికారులు చెప్తున్నారు. బుధవారం శ్రీవారిని దర్శించుకునేందుకు ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ సిఫార్సు లేఖ తీసుకొని వచ్చారని, మంగళవారం ఆ లెటర్ ఇవ్వాల్సి ఉండగా గురువారం వచ్చి హడావుడి చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news