షాకింగ్: ”ఆదిపురుష్” సినిమాకు అలాంటి పరిస్థితి ఆయన వల్లే.!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ చేద్దామని అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ కోసం రిలీజ్ వచ్చే సంవత్సరం జూన్ కు వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాల తో వుంటే  ప్రమోషన్స్ లో భాగంగా  రిలీజ్ చేసిన టీజర్  లో గ్రాఫిక్స్ నాసిరకం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. 

అదే సమయంలో కొంత మంది  హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కూడా  ‘ఆది పురుష్’ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా హనుమంతుడు, రావణాసురుడు కనిపించిన విధానం, చాలా మందికి విమర్శలు గుప్పించేలా చేసింది. ఈ  నెగిటివ్ కామెంట్స్ కు భయపడి దర్శకుడు ఓం రౌత్ వెనక్కి తగ్గాడు.

ఈ సినిమా  గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మళ్లీ VFX వారితో మాట్లాడి, మంచిగా వచ్చేలా చేయటం కోసం మరో వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇక బాగా విమర్శలు వచ్చిన  హనుమంతుడు, రావణాసురుడు వేసిన నటులతో మళ్లీ రీ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా ను ఆరు నెలలు వాయిదా వేశారు. ఇక వాళ్ల డేట్స్ ఎడ్జస్ట్ అయ్యి, షూటింగ్ జరిగి, గ్రాఫిక్ వర్క్ పూర్తి అయితే అప్పుడు మాత్రమే సినిమా పూర్తి అవుతుంది. లేకుంటే మళ్లీ వాయిదానే.

Read more RELATED
Recommended to you

Latest news