నీటి పన్ను కట్టాలంటూ తాజ్​మహల్​కు​ నోటీసులు

-

చారిత్రక కట్టడం తాజ్​మహల్​కు ఆస్తి పన్ను కట్టాలని ఇటీవల ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్​(ఏఎంసీ) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్​ఐ)కి జారీ చేసిన నోటీసులు తీవ్ర చర్చకు దారి తీశాయి. అది మరవకముందే ఏఎస్‌ఐకి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ మరో సారి నోటీసులు పంపింది. తాజ్​మహల్​కు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి బకాయి పడ్డ బిల్లులను చెల్లించమని కోరుతూ ఆగ్రా జల్కల్ విభాగం తరఫున నోటీసులు పంపించినట్లు ఆగ్రా మున్సిపల్​ అధికారులు తెలిపారు.

తాజాగా పంపిన నోటీసులో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ ఛార్జీల కింద మొత్తం రూ.1.96 కోట్లు విలువైన 13 బిల్లులను పంపడం ఏఎస్​ఐ అధికారులను షాక్​కు గురిచేసింది. ఈ పన్నులపై ఏఎస్​ఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తాజ్​మహల్​తో సహా దేశంలోని అనేక స్మారక చిహ్నాలకు ఈ రకమైన పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం-1904 ప్రకారం చారిత్రక కట్టడాలకు ఇటువంటి పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,693 వారసత్వ ప్రదేశాలకు ఏఎస్​ఐ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news