మరో సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ పై సంతకం చేసిన ఐశ్వర్యరాయ్..!

-

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అటు బాలీవుడ్ , ఇటు సౌత్ సినీ పరిశ్రమను తన నటనతో.. అందంతో మంత్రముగ్ధుల్ని చేసిన విషయం తెలిసిందే. అయితే ఈమె ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తమిళంలో దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పోన్నియన్ సెల్వన్ సినిమాలో నందిని క్యారెక్టర్ లో నటించి భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఐశ్వర్యరాయ్ ఇప్పుడు మళ్లీ కొంతకాలం గ్యాప్ తీసుకొని ఈ సినిమా సీక్వెల్లో కూడా నటించింది. ఈ సినిమా సీక్వెల్ ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ నటి , మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యారాయ్ తాజాగా మరో ప్రెస్టేజియస్ సినిమా లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. ఆ సౌత్ ఇండియన్ స్టార్ హీరో ఎవరో కాదు అజిత్. తాజాగా సంక్రాంతి పండుగకు తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. #AK 62 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం లో ఐశ్వర్యరాయ్.. అజిత్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఈ చిత్ర కథ ఆమెకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు పూర్తి వివరాలను అఫీషియల్ లాంచ్ సందర్భంగా ప్రకటించాలని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇందులో అరవింద్ స్వామి మెయిన్ విలన్ గా నటించబోతున్నారు. ఇక తమిళ్లో స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news