అక్బరుద్ధీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది.

-

అసెంబ్లీ వేదిక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తోనే ఉంటామని అన్నారు. వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించారు. అభినందనలు మాత్రమే కాదు విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. గత మూడేళ్లుగా మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో మెడకల్ వ్యవస్థ పనితీరు సరిగా లేదని అన్నారు. 

తెలంగాణ ఏర్పాటు నుంచి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది. పలు మార్లు కేసీఆర్, అటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా టీఆర్ఎస్, ఎంఐఎం మిత్ర పక్షాలని.. లౌకిక పార్టీలని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఈరెండు పార్టీలు కలిసి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. ఇటీవల యూపీ ఎన్నికల  నేపథ్యంలో అసదుద్దీన్ పార్టీ పోటీ చేయడాన్ని సీఎం కేసీఆర్ స్వాగతించారు. తెలంగాణ బిడ్డ యూపీలో పోటీచేస్తే మంచిదే కదా అంటూ.. వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news