విషం కలిపారన్న అనుమానంతో.. పోలీసులు ఇచ్చిన ‘టీ’ని తిరస్కరించిన అఖిలేశ్

-

విషం కలిపారన్న అనుమానంతో పోలీసులు ఇచ్చిన టీని నిరాకరించారు సమాజ్​​వాదీ​ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. ఆదివారం ఉదయం ఆయన ఉత్తర్​ప్రదేశ్​లోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఆయనకు ఛాయ్​ అందించగా.. దానిలో విషం ఉండొచ్చని తిరస్కరించారు. అనంతరం తన మనిషి బయట నుంచి తెచ్చిన టీ తాగుతానని చెప్పారు.

సోషల్​మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు చేశారనే ఆరోపణలతో.. సమాజ్‌వాదీ పార్టీ ఆఫీస్ బేరర్ మనీశ్​ జగన్ అగర్వాల్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అగర్వాల్ అరెస్ట్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేశ్​ యాదవ్​.. తన కార్యకర్తలతో పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడ సిబ్బంది అఖిలేశ్​కు టీ అందించగా.. “ఇక్కడి టీ నేను తాగను.. బయటి నుంచి తెచ్చిన టీ తాగుతాను.. విషం కలిపితే ఎలా?” అని దాన్ని తిరస్కరించారు. అనంతరం తన వెంట వచ్చిన ఒకరిని బయట ఏమైనా టీ దుకాణం ఉంటే అక్కడ నుంచి తీసుకురమ్మని పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news