భారత్‌కు ఆల్‌ఖైదా బెదిరింపులు.. ఆత్మహుతి దాడులకు పాల్పడుతామంటూ..

-

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు భారత్ లోనే కాదు,
అంతర్జాతీయంగానూ ప్రకంపనలకు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ.

Accept and respect party's decision: Nupur Sharma on suspension from BJP -  Oneindia News

మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు అని అల్ ఖైదా ఉగ్రవాద స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. “మా ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేహాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవంలేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి” అంటూ లేఖలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news