తెలంగాణలో మరో దారుణం..13 ఏళ్ల బాలికపై లైంగికదాడి

-

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. మహమూబ్‌ నగర్‌ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కోయిలకొండ మండలంలో ఓ పిండి గిర్ని వద్ద గొల్ల రవి కూమార్‌ అనే యువకుడు బాలికకు పరిచయం అయ్యాడు. ఆ బాలికతో పలుమార్లు మాట్లాడి.. పరిచయం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే రెండు నెలల కిందట రవికుమార్‌, మరో యువకుడు గడ్డం శ్రీకాంత్‌ తో కలిసి.. బాలిక గ్రామమైన అంకిళ్లకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. యువకులు ఇద్దరూ ఒకరి తర్వాత.. ఒకరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

బాలికకు రెండు నెలలైనా నెలసరి కాకపోవడంతో.. తల్లి కోయిలకొండ ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. బాలిక గర్భవతి అని తేలడంతో.. తన కూతురును నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ నిందితులపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు….నిందితులను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news