రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగష్టు 1 నుంచి కొత్త నిభంధనలు అమలు..

-

ఎక్కువ మంది కంఫర్ట్ ను చూసుకుంటున్నారు..అందుకే రైలు ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రయాణికులను మరింత ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ కూడా కొత్త ఆఫర్లను అందిస్తుంది..ఇప్పుడు మరో అలర్ట్ ను జారీ చేసింది.ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ మరో నిబంధనను అమలులోకి తీసుకురానుంది.వచ్చే నెల ఆగష్టు 1 తారీఖు నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఆగష్టు 1నుంచి రైల్వేస్టేషన్‌లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో డబ్బు స్వీకరిస్తారు. నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు..ఇందు కోసం యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్‌లు, స్వైపింగ్ మెషీన్‌లను కలిగి ఉండటం తప్పనిసరిగా ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని సూచించింది. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంపై ఏ వస్తువునైనా ఎమ్మార్పీ ధరకే స్టాళ్ల నిర్వాహకులు విక్రయించనున్నారు..

స్టేషన్లలో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారన్న ఆరోపణలను ఈ విధానం ద్వారా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి అమ్మి ప్రయాణికులను దోచుకునేవారు. క్యాష్ లెస్ చెల్లింపులతో ఇకపై ఎక్కువ ధరకు విక్రయించలేరు. క్యాటరింగ్ క్యాష్‌లెస్ చెల్లింపులపై గతంలో రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది. స్టాల్స్‌తో పాటు ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్ లలో డిజిటల్ పేమెంట్స్ జరుగుతాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ నిబంధనల వల్ల వస్తువులు కరెక్ట్ రేటుకు లభిస్తాయని ప్రయాణికులకు బెస్ట్ అని అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news