పేదల పట్ల చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: ఎమ్మెల్యే ఆళ్ళ

-

ఏపీలో జగన్ పాలన గురించి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి తాజాగా స్పందించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారన్నారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో నివసించే పేద ప్రజలకు సీఎం జగన్ ఇంటి స్థలాలలను పంపిణీ చేసే విషయంపై స్పందించిన రామకృష్ణ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పేదకు ఉండే సొంత ఇంటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. జగన్ పేదల ఇళ్లకు పట్టాలు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్ష కోర్ట్ లో కేసులు వేస్తూ పేదల నోళ్లు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫైనల్ గా ఆ కోర్ట్ లే పెద్ద ప్రజలకు మద్దతుగా తీర్పును ఇచ్చిందని చెప్పారు. ఈ ఘటన ద్వారా పేదల పాలిట చంద్రబాబు చాల దుర్మార్గంగా వ్యవహరించారని రామకృష్ణ రెడ్డి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news