OTT లోకి రానున్న అల్లరి నరేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

-

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ మరొకసారి తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాంది సినిమాతో తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నరేష్ మళ్లీ అలాంటి కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక తన అద్భుతమైన నటనను కనబరిచారు అల్లరి నరేష్.

రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న కొన్నిటిని ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఇదంతా ఇలా ఉండగా థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో సందడి చేయడానికి సిద్ధమయ్యింది ఈ చిత్రం. విడుదల అయి దాదాపుగా ఇప్పటికీ 30 రోజుల పైన కావస్తోంది. దీంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన జీ-5 లో విడుదల చేయబోతున్నారు క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈనెల 23వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది Zee -5 ఓటీటీ సంస్థ. వచ్చే ఏడాది జనవరిలో స్ట్రీమింగ్ చేయాలని వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే ఈ చిత్రాన్ని అల్లరి నరేష్ అభిమానుల కోసం విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news