అరుదైన అవార్డ్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..!!

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళి పోయారు. అల్లు అర్జున్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం పిధా అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా కు  `సైమా`, `ఫిల్మ్ ఫేర్‌` అవార్డులు వచ్చాయి.మరోవైపు సినిమా కూడా కలెక్షన్ల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

దీనితో చాలా కార్పొరేట్ సంస్థల కన్ను బన్నీ మీద పడింది. తమ సంస్థల ప్రకటన లలో బుక్ చేసుకున్నాయి. రీసెంట్ గా పుష్ప సినిమా రష్యా లో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే దేశంలో అతని ఫాలోయింగ్ బాగా పెరిగింది. రీసెంట్ గా అల్లు అర్జున్  సీఎన్‌ఎన్‌ 18 ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2022 గా నిలిచాడు. ప్రస్తుతం బన్నీ మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

ప్రముఖ మేగజీన్‌ `జీక్యూ` అందించే ప్రతిష్టాత్మక పురస్కారం అల్లు అర్జున్ కి దక్కింది. జీక్యూ అవార్డు 2022కి సంబంధించిన `జీక్యూ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌` అవార్డుని అందుకున్నారు. అంతేకాదు ఆయన్ని `లీడింగ్‌ మ్యాన్‌`గా పొగడ్తల లో ముంచెత్తారు.. తాజాగా ఫలక్‌నూమా ప్యాలెస్‌ లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ నిలవడం విశేషం. తమ అభిమాన నటుడికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ ప్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news