అన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్న అల్లు బ్రదర్..!!

-

ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో బడా ఫ్యామిలీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ ఎలాంటి రూమర్స్ కానీ మరే ఇతర వివాదాలకి కానీ చోటు ఇవ్వలేదు. కానీ ఇటీవల అల్లు అర్జున్ తో అల్లు శిరీష్ గొడవపడి మరీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ జరుగుతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో పుకార్ లు షికారులు అవుతూ ఉండడం గమనార్హం.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు.. అందులో అల్లు బాబీ, అల్లు అర్జున్ , అల్లు శిరీష్.. వీరిలో అల్లు బాబీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ లో ఉండగా శిరీష్ , అల్లు అర్జున్ ఇద్దరూ కూడా సినిమాలు చేస్తూ హీరోలుగా మారారు. ఇక తాజాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు శిరీష్ ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడని సమాచారం అందుతుంది.. అల్లు శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్ తో పాటు తన అన్న అల్లు అర్జున్ తో కూడా గొడవపడి ముంబైకి వెళ్లారట. నిజానికి అల్లు అరవింద్ బన్నీ పై ఫోకస్ పెట్టినట్టుగా తనపై ఫోకస్ పెట్టడం లేదనే బాధతోనే ఇలా చేశాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

తన అన్న ఎదుగుదలకు ఎంతో కష్టపడితే కనీసం ఇప్పుడు గుర్తింపు కూడా దక్కలేదు అనే బాధతోనే శిరీష్ ముంబై వెళ్ళిపోయినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇలా వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news