పోలవరం గురించి మళ్లీ ప్రస్తావిస్తే..ఒరేయ్…తురేయ్ అనాల్సి ఉంటుంది -అంబటి

-

ఏమయ్యా రాంబాబు అని దేవినేని ఉమ అంటున్నాడు… మరోసారి ఇలా అంటే నేను కూడా ఒరేయ్…తురేయ్ అనాల్సి ఉంటుందని హెచ్చరించారు అంబటి రాంబాబు. పోలవరం జాప్యానికి కారణం జగన్ ప్రభుత్వం అని బ్రాండింగ్ చేయటానికి టీడీపీ, టీడీపీ మద్దతు మీడియా ప్రయత్నం చేస్తున్నారన్నారు.

టీడీపీ ప్రభుత్వం దుర్మార్గం చేసిందని.. కాఫర్ డ్యాం లేకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టిన ప్రబుద్ధులు అని మండిపడ్డారు. స్పిల్ వే నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారని.. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

దాన్ని ఎలా పునరుద్ధరించాలా అని నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.. నిత్యావసర వస్తువులు సక్రమంగా ఇచ్చిన ప్రభుత్వం ఇదన్నారు. ఈ స్థాయిలో వరదలు వచ్చినా ఒక్క ప్రాణ నష్టం జరక్కుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్నా…లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం జరక్కుండా కంటికి రెప్పలా కాపాడామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news