వారాహి ఎక్కితే, భస్మం అయిపోతావు – పవన్‌ కళ్యాణ్‌ కు అంబటి వార్నింగ్‌

-

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి అన్నది అమ్మవారి పేరు. ఆ పేరు రథానికి పెట్టి, ఎలా ఎక్కి తిరుగుతావు?. అలా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు. భస్మం అయిపోతావు. అందుకే రథం పేరు మార్చుకో. పవన్‌కళ్యాణ్‌కు మంత్రి అంబటి సూచనలు చేశారు.

పవన్ కళ్యాణ్ వైసీపీ పై విమర్శలు చేసినట్లు కనిపించినా ఆయన ఇచ్చిన సందేశం వేరని, సత్తెనపల్లి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీకి డైరెక్ట్‌గా ఒక మెసేజ్ పంపించారన్నారు మంత్రి అంబటి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని స్పష్టం చేశారని, చంద్రబాబును గెలిపించటానికి గాడిదలా మోస్తానని ప్రకటించారన్నారు మంత్రి అంబటి. మీరు కూడా నాలానే గాడిదలా చంద్రబాబును గెలిపించే బరువును మోయమంటున్నాడని, ఈ వ్యూహాన్ని ఆ పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్‌కు చాలా మందితో విడిపోవటం అలవాటు అని మంత్రి అంబటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news