విమోచన దినోత్సవ వేడుకలకు అమిత్ షా.. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌కు రాక

-

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికోసం అమిత్‌ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఈ నెల 16న అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నిక అంశంపైనే ప్రధానంగా చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో చర్చించి పూర్తిస్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 11న మునుగోడుకు బండి సంజయ్‌ వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని బీజేపీ కోర్ కమిటీలో నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news