తెలంగాణ గురించి అమిత్ షా కు ఏమీ తెలియదు: ఎర్రబెల్లి

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు తెలంగాణ గురించి ఏమీ తెలియదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజుకు.. తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సర్పంచులకు రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు అన్నీ ఇచ్చేశామని అన్నారు. కేంద్రమే తన వాటా ఇవ్వడం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాగా గురువారం ఢిల్లీ వేదికగా జరిపిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాంజీగోండ్, కొమరం భీమ్ తో పాటు అల్లూరి సీతారామరాజు పేరును ప్రస్తావించారు.

నిజాం వ్యతిరేక పోరాటంలో ఎందరో వీరులు పోరాడారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ లో అల్లూరి సీతారామరాజు ఫోటోలను కూడా ప్రదర్శించారు. సరిగ్గా ఈ పరిణామమే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కు కారణమైంది. అల్లూరికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తుంది గులాబి కేడర్. ఇక బీజేపీ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news