ఆయన మరణ వార్తతో షాకైనా అమితాబ్..!

-

బిగ్ బి అమితాబ్ తనకెంతో ఆత్మీయుడు మృతితో తన ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేసారు. ప్రముఖ రాజకీయ వేత్త రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఒకప్పడు అమర్ సింగ్‌తో సన్నిహితంగా మెలిగిన అమితాబ్ బచ్చన్ ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోను అమితాబ్ అమర్ సింగ్‌ను గుర్తుకు తెచ్చుకొని షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఫోటోలో అమితాబ్ బచ్చన్ తల దించుకొని బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో నివాళులు అర్పిస్తున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసారు. కాగా, అమర్ సింగ్ మృతిపై దేశ్ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమర్ సింగ్ విచారం వ్యక్తం చేసారు. ఇకపోతే బిగ్ బి ప్రస్తుతం నానావతి హాస్పటిల్‌లో కోవిడ్-19కు చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news