పల్నాడులో అరాచకం.. అక్కడ రీ పోలింగ్ జరగాల్సిందే : అంబటి రాంబాబు

-

మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి (సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయానని.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యథేచ్ఛగా తిరిగారని ఆయన అన్నారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని.. ఈ ఆరు బూత్లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలని.. ఈ ఆరు బూత్లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు.

కొత్త గణేషం పాడు గ్రామంలో టీడీపీ దాడులు చేస్తోందని.. మగవారంతా ఊరు విడిచి వెళ్లిపోయారని మండిపోయారు. గుళ్లల్లో దాక్కున్న మహిళల మీద దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. వారి వద్దకు వెళ్తున్న అనీల్ యాదవ్, కాసు మహేష్ వాహనాలపై కూడా దాడి చేశారని.. పల్నాడు అంతా అరాచకంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news