యాంకర్ ఝాన్సీకి క‌రోనా.. దయచేసి నాకు ఫోన్ చేయకండి..!

-

కరోనా వైరస్ తో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో చాలా అసత్యప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

పరివార్ సీజన్ 2 హోస్ట్‌ గా ఉన్న యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని, కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించి స్పష్టతనిచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, షూటింగుల్లో పాల్గొంటోన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news