ఏపీలో కరోనా టెర్రర్.. మరోసారి భారీగా పెరిగిన కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094 కి పెరిగింది. అలాగే మరో 73 మంది కరోనా వల్ల మరణించారు.

దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,560 కి చేరింది. నేడు 11,691 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా..ఇప్పటివరకు మొత్తం 4,15,765 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,679 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42,37,070 టెస్టులు జరిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news