సీఎం వైయస్ జగన్‌ మరోసారి గెలవడం ఖాయం : అంబటి రాంబాబు

-

సీఎం వైఎస్ జగన్‌ మరోసారి గెలవడం ఖాయమని సత్తనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి  అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు, వికలాంగులు, మ‌హిళ‌లు భారీగా తరలిరావడం చూస్తే సీఎం వైయస్ జగన్‌ మరోసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నా నియోజకవర్గంలో పోలీసులు డబ్బులు తీసుకుని అవతలి పార్టీకి అమ్ముడుపోయారని తెలిపారు.

దమ్మాలపాడు గ్రామంలో కన్నా వర్గం 1000 దొంగ ఓట్లు వేశారు. అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి. అలాగే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సంకేతాలు వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారని తెలిపారు. మాచర్లలో టీడీపీ గూండాలు బరితెగించి విధ్వంసం సృష్టించారు. దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదు..వాళ్లే అభ్యర్థుల్లా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news