కూటమి చెంప చెళ్లుమనిపించాలి : సీఎం జగన్

-

మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్టీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ ఆగిపోతాయి. నాకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయి. డబుల్ సెంచరీ కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. ఈ ఎన్నికలు ప్రతీ ఒక్కరి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. పెత్తందారుల ముఠా పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.

రాష్ట్ర భవిష్యత్ , పేదల భవిష్యత్ ను కాపాడటమే వైసీపీ లక్ష్యం అన్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసునామీని చూశాం. గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. పేద, ధనిక విద్యార్థులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం. మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథాలుగా భావిస్తాను.. చంద్రబాబులా నేను మోసపు హామీలు ఇవ్వవు. ఇచ్చే హామీలు నెరవేర్చేవే ఇస్తానని తెలిపారు. పలాస నుంచి అప్పలనాయుడు ని పోటీలో ఉంటున్నాడు.. మంచి చేస్తాడు.. మంత్రిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసే సైకిల్ ఇంటి బయట.. తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news