ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రభాస్ పెద్దమ్మ

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారాన్ని వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జే.పీ.నడ్డా వంటి సీనియర్ నేతలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో రెబల్ స్టార్ ప్రభాస్ సతీమణి శ్యామలదేవి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో 450 స్థానాలతో మోడీ గెలుస్తున్నారు రాష్ట్రంలో కూటమి చంద్రబాబు 175 స్థానాల్లో గెలుస్తుందని..  జనసేన పోటీ చేసే స్థానాలని కూడా గెలుస్తున్నాయి చెప్పారు. మళ్లీ  విజయోత్స ర్యాలీలో పాల్గొంటానని చెప్పింది ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ నా తమ్ముడు.. మా కుటుంబ సభ్యుడు ఆయన గెలిస్తే నేను గెలిచినట్లేనని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news