వైసీపీ పాలనలో రూ.8లక్షల కోట్ల అవినీతి.. పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మే 13న ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ నేత కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో రూ. 8 లక్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో బీజేపీ, జ‌న‌సేన నేత‌ల‌తో క‌లిసి ఆయ‌న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈసందర్భంగా  ప‌ట్టాభిరామ్ మాట్లాడుతూ.. అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చాలా ఈజీగా అమ‌లు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అవినీతిని అరిక‌ట్ట‌డంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామ‌ని అన్నారు. అలాగే కూట‌మి మేనిఫెస్టోలోని ప్ర‌తి హామీని అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news