రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో గుణపాఠం చెబుతాం….

-

అంగన్వాడి కార్యకర్తలు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఈరోజు మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో వారి యొక్క నిరసన తెలిపారు. కలెక్టర్ రేట్ వద్ద వైసిపి ని పోలిన కండువాను తీసుకొని జగన్కు పాడే ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలని అంగన్వాడి కార్యకర్తలు ఆ పాడే ముందు చెవుల్లో పువ్వులు మరియు క్యాబేజీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ తాము గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నామని అయినప్పటికీ జగన్ ప్రభుత్వం స్పందించడం లేదని క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ కనీస వేతనం మరియు గ్రాట్యుటి ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటుతో సరైన సమాధానం చెబుతామని అంగన్వాడి కార్యకర్తలు పేర్కొన్నారు.

 

అలాగే గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో వంటా వార్పు కార్యక్రమాలు చేస్తూ తమ యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news