పుట్టినరోజు పేరుతో 50 కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు – యనమల

-

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పేరుతో 50 కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని ఆరోపించారు టిడిపి నేత యనమల రామకృష్ణుడు. జగన్ దృష్టిలో సంక్షేమం అంటే పుట్టినరోజున సొంత మీడియాకు ఆదాయం సమకూర్చడమేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనల పేరిట కొనసాగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. ప్రతి రూపాయి జాగ్రత్తగా వినియోగించే విజ్ఞత జగన్ కు కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు యనమల రామకృష్ణుడు.

yanamala ramakrishnudu

ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్ రెడ్డి గట్టిగా విశ్వసిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు యనమల. తన పత్రికలో మొదటి, చివరి పేజీలలో రంగురంగులతో ఫుల్ పేజీ ప్రకటనలతో పాటు మరో ఐదు పేజీలు ప్రకటనలతో నింపి అక్రమార్చనకు పాల్పడ్డారని యనమల ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news