విశాఖలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌…కారులో ఎక్కించుకని మరీ !

-

విశాఖ గోపాలపట్నం లో మెనర్ బాలిక పై అత్యాచారం జరిగింది. ఇంట్లో నుంచి అలిగి వచ్చిన మైనర్ బాలికను గోపాలపట్నం మెయిన్ రోడ్ లో కారులో ఎక్కించుకుని ఆగాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. తన అవసరం తీరిన తర్వాత ప్రహ్లాదపురంలో ఒక మహిళకు అప్పజేప్పాడు నిందితుడు. ఆ మహిళ మరో ముగ్గురు యువకులతో అత్యాచారానికి ప్రోత్సహించింది.

ఈ సంఘటనపై బాలిక… గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ రేప్ ఘటన లో మధ్యవర్తి అమ్మాయితో పాటు మరో ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నారు గోపాలపట్నం పోలీసులు. ఈ రేప్ కేసులో ఒక విలేఖరి కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రెండు రోజుల క్రితం మైనర్ బాలిక కనపడటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాతగోపాల పట్నానికి చెందిన దళిత మైనర్ బాలికగా పోలీసులు గుర్తించి…తల్లిందండ్రులకు అప్పగించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు గోపాలపట్నం పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news