రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది : జగన్

-

రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో లారీ ఇసుక రేటు రూ.60వేల వరకు ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.30 నుంచి 50వేల వరకు ఉంది. ఇసుక పై చాలా ప్రచారం చేశారు. ఒకవైపు ఇసుక ఉచితం అంటారు.. రేట్లు చూస్తే దారుణం అని చెప్పారు జగన్. అప్పట్లో ఇసుక సామ్రాజ్యం చూసినా ఇదే వ్యవహారం కొనసాగింది.

టెండర్లకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. అందరూ దసరా పండుగ సందర్భంలో బిజీగా ఉంటే.. ఆ సమయంలో టెండర్లకు రెండు రోజులు సమయం ఇవ్వడం దారుణం అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. మార్పు తీసుకొస్తున్నామంటూ స్కామ్ లకు తెర లేపారు. వైసీపీ హయాంలో ఇసుక ఎంతో పారదర్శంగా ఉండేది అని గుర్తు చేశారు. 5 నెలలుగా సూపర్ సిక్స్ జాడే లేదు అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news