రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నాం..అందరి అంతు చూస్తాం – కౌశిక్ రెడ్డి

-

జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేశాడు. ఈ సంఘటన ఏపీలోని కొవ్వూరు లో చోటు చేసుకుంది. కొవ్వూరు – అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరించాడు.

A man said that there is no inquiry into why Jagan lost

అయితే.. ఈ సంఘటనపై సకాలంలో స్పందించిన పోలీసులు… వారిని అడ్డుకొని నచ్చజెప్పారు. జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని ఈ వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైయస్సార్ అభిమాని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. ఇప్పటికిప్పుడు మళ్లీ ఎలక్షన్ జరపాలని ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే జగనన్నే అధిక మెజారిటీతో గెలుస్తాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొవ్వూరు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు.

https://x.com/TeluguScribe/status/1800415798286274742

Read more RELATED
Recommended to you

Latest news