కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

-

ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ వర్షాలు ఏ రోజు నుంచి కురుస్తాయో మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్ది మేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉందని స్పష్టం చేసింది.

ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. ప్రత్యేకించి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news