BREAKING : సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మరో లేఖ

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి.

ఈ నేపథ్యంలోనే… ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నానంటూ లేఖ రాశారు అవినాష్‌ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శంగా సాగాలని కోరుతున్నా.. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వెల్లడించారు వైఎస్‌ అవినాష్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news