ఇవాళే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల..ఇలా చెక్‌ చేసుకోండి

-

ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల కానున్నాయి. ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసే తేదీని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు.

ఈ విషయంపై తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ… గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలు పరీక్షలు పూర్తి అయ్యాక 28 రోజుల్లో ప్రకటించామని వివరించారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడూ లేని విధంగా పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే విడుదల చేస్తున్నాము అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇందులో ఏ విధమైన లీక్ లేకుండా చాలా పారదర్శకంగా ఈ ఫలితాలను విడుదల చేస్తున్నాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news