ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

-

తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన విషయం అందరికీ  తెలిసిందే. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు నిన్న ప్రవేశపెట్టారు. దీనికి తాజాగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు.

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. మిగతా సభ్యులు అందరూ మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా మందికి సమస్యలుండేవని ప్రస్తావించారు. ఈ యాక్ట్ రద్దు వల్ల చాలా మేలు జరుగుతుందని తెలిపారు. కొన్ని సెక్షన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version