బ్రేకింగ్: ఏపీ సిఎస్ పదవీ కాలం పొడిగింపు

-

ఏపీ సిఎస్ నీలం సాహ్ని పదవి కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె పదవీ కాలం గతంలో పూర్తి కావడంతో మూడు నెలలు పదవీకాలం పొడిగించింది ఏపీ సర్కార్. సెప్టెంబర్ 30 న పదవి విరమణ చేయాల్సి ఉండగా మరో సారి పదవి కాలం పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వులతో డిసెంబర్ 31 వరకు పదవిలో కొనసాగనున్నారు నీలం సాహ్ని.

గత ఏడాది నవంబర్ లో ఆమె పదవి చేపట్టారు. అప్పుడు సిఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంని రాష్ట్ర ప్రభుత్వం తప్పించి ఆ పదవిలో నీలం సహానీని తీసుకొచ్చారు. ఆమె పని తీరు సిఎం జగన్ కి నచ్చడం అదే విధంగా ఆమె అనుభవం కూడా సిఎం జగన్ కు కలిసి రావడంతో ఆమెను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news