ఇవాళ జగన్ సంచలన ప్రెస్ మీట్..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏపీలో జరుగుతాయో అని టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే.. మొన్న వైసీపీ నేత రషీద్ హత్య ఘటన తర్వాత… అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ సంఘటనపై జగన్మోహన్ రెడ్డి… అసెంబ్లీ వద్దకు వచ్చి నిరసన తెలపడం..ఢిల్లీలో ధర్నాలో పాల్గొనడం జరిగింది.

AP Ex CM Jagan Press Meet

ఇక దీనికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన హింసకాండపై శ్వేత పత్రం కూడా రిలీజ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే… జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 11:30 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.

అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో… డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఏదేమైనా ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి… రెచ్చిపోయే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news