తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుంది – నారా లోకేష్

-

తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందన్నారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకాన్ని తెలుగుతేజం నంద‌మూరి తార‌క‌రామారావు గారు స‌గ‌ర్వంగా ఎగుర‌వేసిన రోజు తెలుగుదేశానికి ప‌ర్వ‌దినం అన్నారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభ్యున్న‌తి, తెలుగుజాతి ఆత్మాభిమానం ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి తెచ్చిన మ‌హానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు గారు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌న‌వ‌రి 9 రోజు నిజ‌మైన పండ‌గ‌రోజు అన్నారు.

ఎన్టీఆర్ గారి క్ర‌మ‌శిక్ష‌ణ‌, సంపాదించిన‌ కీర్తి, చూపిన‌ స్ఫూర్తి తెలుగుదేశం బ‌లం అని.. తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కూ తెలుగుదేశం ఉంటుందన్నారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అని ట్విట్టర్ వేదికగా అన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news