డిప్యూటీ సీఎం నారాయణస్వామికి బిగ్ షాక్..తాళాలు వేసి మరీ !

-

చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సిఎంకు మరోసారి షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామికు ఊహించని షాక్‌ ఇచ్చారు ఆయన నియోజక వర్గం ప్రజలు. గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

పాచి గుంట గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వస్తున్నాడని సుమారు 20 కుటుంబాలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు గ్రామస్తులు. ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయిన గ్రామస్తులకు నోటీసువ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈ తరుణంలోనే అర్హత ఉన్న వారందరికీ పథకాలు ఇవ్వండి అర్హత లేని వారికి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news