BREAKING : సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు బిగ్ షాక్ !

-

జీవో-1పై ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్‌ సర్కార్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‍పై విచారణ ముగించింది సుప్రీంకోర్టు.

తాజాగా జీవో-1పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సర్కార్. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‍పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ ఏపీ హైకోర్టు చేపడుతుందని వెల్లడించింది ధర్మాసనం. ఈనెల 23న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‍తో విచారణ జరిపించాలని ఆదేశించింది. వాదప్రతివాదులు అన్ని అంశాలను డివిజన్ ముందు ప్రసావించుకోవచ్చని పేర్కొన్న సుప్రీంకోర్టు… అన్ని అంశాలను ఓపెన్‍గా ఉంచుతామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news