వివేకా హత్య కేసుపై బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి. వైయస్ వివేక హత్య కేసులో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గుచేటని అన్నారు. నేరం చేసిన వాళ్లకు శిక్ష పడడం ఖాయం అన్నారు ఆదినారాయణరెడ్డి. హత్య చేసిన వాళ్ళు, చేసే వాళ్ళు అంతా మాట్లాడుకునే వివేకను చంపారని ఆరోపించారు. అన్యాయంగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి.

వివేక హత్య కేసులో తన ప్రమేయం ఉంటే ఉరి తీయండని అన్నారు. సిబిఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఎన్కౌంటర్ చేసినా సిద్ధమేనని సవాల్ చేశారు ఆదినారాయణ రెడ్డి. ఈ కేసులో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే ఏం చెబుతారు..? అని ప్రశ్నించారు. పథకం ప్రకారమే వివేకను హత్య చేశారని.. అరెస్టు చేస్తారనే భయంతోనే ముందస్తు బెయిల్ కోసం వెళ్లారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news