BREAKING : వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

-

BREAKING : వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ ను వైఎస్‌ షర్మిలకు ఇచ్చింది కోర్టు. 30 వేల రూపాయల రెండు ష్యురిటీ లతో పాటు విదేశాలకు వెళ్లాలను కునే సమయంలో కోర్ట్ అనుమతి తప్పనిసరి కోర్టు స్పష్టం చేసింది.

అలాగే దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది కోర్టు. దీంతో ఇవాళ సాయంత్రం వైఎస్‌ షర్మిల జైలు నుంచి రిలీజ్‌ కానున్నారు. ఇక అంతకు ముందు..త్వరలోనే మళ్లీ షర్మిల ప్రజల ముందుకు వస్తుందని విజయమ్మ అన్నారు. చంచెల్‌ గూడలో షర్మిలను పరామర్శించిన అనంతరం.. మీడియాతో విజయమ్మ మాట్లాడారు. జరుగుతుంనదంతా మీరు చూస్తున్నారు..ప్రజల కోసం ప్రశ్నించే‌ గొంతును నొక్కుతున్నారని ఆగ్రహించారు. పోలీసుల అత్యుత్సాహం చూపించారని.. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తుందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news