BREAKING : ఏపీలో విషాదం.. పర్యాటక శాఖ పడవ బోల్తా..12 మంది గల్లంతు

-

BREAKING : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ లో పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది. ఈ సంఘటన లో 12 మంది గల్లంతు పర్యాటకులు గల్లంతు అయ్యారు. ఇక 10 మంది ఆచూకీ లభ్యం కాగా.. ఆసుపత్రికి తరలించారు అధికారులు.

మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్బి కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోటోలు తీసుకునేందుకు ఒక వైపునకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే… గాలిలో అలల తాకిడికి బోల్తా పడింది పడవ. ప్రస్తుతానికి అయితే.. కానిస్టేబుల్ రసూల్, భార్య ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news