BREAKING : నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్‌ !

-

BREAKING : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బ్రేక్‌ పడింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 41వ రోజుకు చేరింది. 40 రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు నారా లోకేష్‌. ఇక మొత్తం 520 కిలోమీటర్ల మేర సాగింది లోకేశ్ యువగళం పాదయాత్ర. ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

నారా లోకేశ్, అచ్చెన్న సహా 76 మందిని కేసుల్లో నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇక ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు నారా లోకేశ్. దీంతో రేపు, ఎల్లుండి పాదయాత్రకు విరామం ప్రకటించనున్న నారా లోకేశ్.. ఈ నెల 14న మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news