TTD ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

-

తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.

హెచ్ డి పి పి, ఎస్ వి బి సి కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే గ్రామీణ యువత భాగస్వామ్యంలో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, కాగా, ఇటీవల ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది. దీంతో విజయనగరంలో కవులు మరియు కళాకారులు ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news