జన్మభూమి కమిటీల ద్వారా చంద్రబాబు అన్నీ బ్రోకర్ పనులే చేశారు – మంత్రి ధర్మాన

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. నేడు శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దశలవారీగా అవినీతిని తీసివేస్తామని అన్నారు. తాము నిజాయితీగా ఉంటామని.. గత నాలుగేళ్లలో కార్యకర్తలు కాస్త దెబ్బ తిన్నారని చెప్పారు. నిరంతరం ఖర్చు తప్ప ఎలాంటి లాభం లేదని తెలిపారు.

జన్మభూమి కమిటీల ద్వారా చంద్రబాబు అన్ని బ్రోకర్ పనులే చేశారని తీవ్ర విమర్శలు చేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు గతంలో ప్రజలను ఎలా బెదిరించే వారో తెలియదా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో అవినీతి లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటికే పథకాలు అందుతున్నాయని తెలిపారు. తమని ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా నిజాయితీగా పాలన చేస్తున్నామన్నారు మంత్రి ధర్మాన. ఈ నాలుగేళ్లలో మేనిఫెస్టోలో పొందుపరిచిన పనులను పూర్తి చేసామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news