చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి – ఎంపీ మిథున్ రెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. చంద్రబాబు ఓ క్యారెక్టర్ లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని.. గతంలో అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ ను ఎలా దించేశారో అందరికీ తెలుసని అన్నారు. ఆధారాలతోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని అన్నారు మిథున్ రెడ్డి.

సీఎం జగన్ ను విభేదించిన వారికి ఓటమి తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికలలో సీటు ఇస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికే ఓటు వేస్తామని ఎమ్మెల్సీలు చెప్పారని.. కానీ జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పేశారని తెలిపారు. ఒక ఎమ్మెల్సీ కంటే సీఎం జగన్ వ్యక్తిత్వం ముఖ్యమనుకున్నారని వివరించారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు ఏ గతి పట్టిందో ఇప్పుడు వీరికి కూడా అదే గతి పడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news