చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు – మంత్రి పెద్దిరెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు చిత్తూరు జిల్లా సదుంలో వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో బాగంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. 14 వేల కోట్ల అప్పు కాస్త 26 వేల కోట్లు అయ్యిందన్నారు. కానీ సీఎం జగన్ ఆసరా పథకం పెట్టి మహిళలకు అండగా నిలిచారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. దేశంలో కానీ.. ఇప్పటివరకు రాష్ట్రంలో కానీ.. ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా హామీలు అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్ దని కొనియాడారు. టిడిపి లాగా మీకు కావల్సిన వారికి పథకాలు ఇవ్వండి అని సిఎం చెప్పలేదని.. మనకు ఓటు వేసినా.. వేయకపోయిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ఆదేశించిన గొప్ప వ్యక్తి సిఎం వైఎస్ జగన్ అన్నారు. మహిళల ఆర్థిక వృద్ధికి సిఎం తోడ్పడుతున్నారని వివరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news