కుప్పంలో లక్ష మెజారిటీ సాధించాలి – చంద్రబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ పర్యటనలో చిత్తూరు మాజీ డిసిసి అధ్యక్షుడు సురేష్ బాబు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడమే గాక.. సంక్షేమ పథకాలను అమలు చేయడమో తెలుసని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. కుప్పంలో లక్ష మెజారిటీ సాధించాలని టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news